పలు కుటుంబాలకు ఖమ్మం డీసీసీబీ చైర్మన్ పరామర్శ

by Sridhar Babu |
పలు కుటుంబాలకు ఖమ్మం డీసీసీబీ చైర్మన్  పరామర్శ
X

దిశ, దమ్మపేట : దమ్మపేట మండలంలోని పలు మృతుల కుటుంబాలను మంగళవారం ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణ్ పరామర్శించారు. మండలంలోని మందలపల్లి గ్రామంలో తోర్లపాటి అంకమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం దమ్మపేట మండల కేంద్రంలోని శ్రీకృష్ణ నగర్ కాలనీలో తాళ్ల సురేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబాలను పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా యాదవ సంఘం ఉపాధ్యక్షుడు కర్రీ వెంకటేశ్వరరావు, దమ్మపేట మండల యాదవ సంఘం అధ్యక్షుడు జోనుబోయిన శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు నూనె శ్రీనివాసరావు, మల్లేశ్వరరావు , దమ్మపేట యాదవ సంఘం అధ్యక్షుడు తాళ్ల ప్రభు, సత్తుపల్లి మండల యాదవ సంఘం టౌన్ అధ్యక్షుడు దూదిపల్ల నరసింహారావు, చిర్రా ధర్మారావు పాల్గొన్నారు.



Next Story

Most Viewed