ఖమ్మంలో న్యాయవాదుల విధుల బహిష్కరణ

by Javid Pasha |
ఖమ్మంలో న్యాయవాదుల విధుల బహిష్కరణ
X

దిశ, లీగల్ ఖమ్మం: ఖమ్మం పట్టణానికి చెందిన న్యాయవాదులు మోజేష్ క్రిష్టఫర్, ఆవుల అనురాధలపై దాడిని ఖమ్మం బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. గురువారం ఖమ్మం బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వి.వీరెందర్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం ను నిర్వహించారు. ఈసందర్భంగా ఉపాధ్యక్షుడు వి.వీరెందర్ మాట్లాడుతూ.. గత నెల24న వారి అపార్ట్ మెంట్ నందు క్రిష్టఫర్, ఆయన సతీమణిపైన కొంతమంది దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని చెప్పారు. ఈ దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. న్యాయవాదులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపాలని డిమాండ్ చేశారు. బాధితులకు సరైన భద్రత కల్పించి ఇన్వెస్టిగేషన్ ను సజావుగా నిర్వహించాలని ఆయన కోరారు. న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని ఆమోదించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఖమ్మం బార్ కౌన్సిల్ సభ్యుడు కొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. న్యాయవాదుల పైన దాడిని తీవ్రంగా ఖండించారు. సీనియర్ న్యాయవాదులు న్యాయవాది పైన జరిగిన దాడిని ముక్తకంఠంతో ఖండించారు. అనంతరం న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి తమ నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్లపూడి శ్రీనివాసరావు, చిలుకూరి స్వర్ణ కుమారి, దంతాల నారాయణ, ఎంఏ.తౌఫిక్, నేరెళ్ళ శ్రీనివాసరావు, ఆర్.సుధీర్ సింగ్, మర్రిప్రకాష్, జానయ్య, వినయ్ చార్లెస్, బార్ కార్యవర్గం, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

.



Next Story

Most Viewed