కేరళ సీఎంను కలిసిన ఖమ్మం గ్రంధాలయ మాజీ చైర్మన్

by S Gopi |
కేరళ సీఎంను కలిసిన ఖమ్మం గ్రంధాలయ మాజీ చైర్మన్
X

దిశ, ఖమ్మం: లౌకిక భారత దేశంలో కమ్యూనిస్టుల పాత్ర గొప్పదని, మీ లాంటి నేతలు లౌకిక భారతాన్ని కాపాడాలని, సమాజాన్ని కులాలుగా మతాలుగా విడగొట్టి లబ్ది పొందాలని చూస్తూన్న రాజకీయ పార్టీలపై పోరుకు సీపీఎం, ఇతర లౌకిక పార్టీలకు మైనార్టీల మద్దతు ఉంటుందని ఖమ్మం గ్రంధాలయ మాజీ చైర్మన్ ఖమర్, కేరళ సీఎం పినరయి విజయన్ ని కోరారు. ఖమ్మంకు వచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్ కు ఖమ్మం జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ అజీజ్ -ఉల్ -హక్ (ఖమర్ )ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పినరయితో మాట్లాడుతూ కేరళలో గోప్ప పరిపాలనను అందిస్తున్నారని కీతాబు ఇచ్చారు.



Next Story

Most Viewed