- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భట్టి పాదయాత్రపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

దిశ,ఖమ్మం రూరల్ : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలోని తల్లంపాడు వద్ద పాదయాత్ర శిబిరంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఆయన భేటీ అయ్యారు. ఆయనతో పాటు ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, మాజీ ఎంపీ మల్లురవి తదితరులు భట్టిని కలిసినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడిమాతో మాట్లాడుతూ.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ కోసం చేసింది కాదని.. తెలంగాణ సమాజం కోసం చేసిందని అన్నారు. అభివృద్ధి పేరుతో కేసీఆర్ ఈస్ట్ మన్ కలర్ లో చూపిస్తున్న భ్రమల్ని ఈ పాదయాత్ర పటాపంచలు చేసిందని అన్నారు. భట్టి విక్రమార్క ఊరూరు తిరుగుతూ అక్కడ జరుగుతున్న తప్పిదాలను, నష్టాలను, కేసీఆర్ చేతిలో మోసపోయిన బాధితులను భట్టి విక్రమార్క కలిసి.. వారికి భరోసా కల్పించారని అన్నారు.
ఈ క్రమంలో కేసీఆర్ చేసిన అన్ని రకాల మోసాలను భట్టి విక్రమార్క ప్రజలకు వివరించుకుంటూ ముందుకు సాగారని చెప్పారు. భట్టి విక్రమార్క చేసిన పాదయాత్ర.. కాంగ్రెస్ పార్టీకన్నా మొత్తం తెలంగాణ సమాజానికి మేలు చేసేదని అభివర్ణించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తెలంగాణ ప్రజల సమస్యలకు ఒక జవాబును వెతుకుతుందని, పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో చూసిన సమస్యలు, వాటి పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోగా ఉంటుందన్నారు. ఈ పాదయాత్ర పేదల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు అవసరమైన ఆలోచన చేసేందుకు, నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర నాయకులు రాయల నాగేశ్వరరావు, రాంరెడ్డి చరణ్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు కళ్లెం వెంకట్ రెడ్డి, బొడ వెంకన్న, కేతినేని వేణు తదితరులు ఉన్నారు.