- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అన్ని వర్గాలను మోసం చేసిన కేసీఆర్ : పొంగులేటి

దిశ, సత్తుపల్లి : అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మార్ గార్డెన్ ఎదురుగా ఖమ్మం క్యాంప్ కార్యాలయం ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వ విజయ్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొంగిలేటి శీనన్న ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ ఆశలు, ఆశయాల కోసం ఏర్పడిందో అది నెరవేరలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక నోటిఫికేషన్లు వచ్చాయి కానీ ఉద్యోగాలు మాత్రం ఎవ్వరికి రాలేదని దుయ్యబట్టారు. నియోజకవర్గానికి 100 కోట్లు ప్రకటిస్తున్నట్లు చెప్పడమే తప్పా ఆచరణలో మాత్రం శూన్యం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని, అది ఎవడబ్బ సొత్తు కాదన్నారు. 2018లో ప్రకటించిన నిరుద్యోగ భృతి ఇంతవరకు ఇప్పించలేకపోయారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్లో ఉండగా నేడు ఐదువేల కోట్ల అప్పుల పాలు చేశారని, దళితుల కు దళిత బంధని చెప్పి నియోజకవర్గానికి ఒక్కరిద్దరికీ ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లాతో పాటుగా సత్తుపల్లి నియోజకవర్గంలో శీనన్న అభిమానులను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు.
వడ్డీతో సహా తిరిగి చెల్లించే రోజు దగ్గర్లో ఉందని హెచ్చరించారు. అంతకు ముందు మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వ విజయ్ బాబు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా రైతు బిడ్డ శీనన్నను ఇబ్బంది పెట్టాలని చూస్తే దేవుడు వారిని తప్పక శిక్షిస్తాడని అన్నారు. నేడో రేపో కవిత అరెస్టు కావడం తప్పదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైరా మున్సిపల్ చైర్మన్ నూతకాని జైపాల్, బోరా రాజశేఖర్, అశ్వ రావు పేట నియోజకవర్గం ఇంచార్జ్ జారే ఆదినారాయణ, సర్పంచుల సంఘం అధ్యక్షుడు, నారపోగు వెంకటేశ్వర్లు, కేసర శ్రీనివాసరెడ్డి, అట్లూరి సత్యనారాయణరెడ్డి, మందపాటి ముత్తారెడ్డి, సర్పంచి గౌరి గూడెం, మందపాటి చిట్టి నాయన, మల్లి రెడ్డి మురళి రెడ్డి, శీనన్న అభిమానులు ,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.