- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రజా సంక్షేమానికి పరితపించే నేత కేసీఆర్

దిశ, కారేపల్లి : ప్రజాసంక్షేమ కోసం పరితపించే నేత సీఎం కేసీఆర్ అని వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ అన్నారు. ఆదివారం కారేపల్లి మండలంలో ఆయన పర్యటించారు. విశ్వనాథపల్లిలో ఇటీవల మృతి చెందిన తాతా నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు ఆర్పించారు. కారేపల్లి క్రాస్ రోడ్ లో ఇటీవల మృతి చెందిన సీపీఎం కార్యకర్త దైదా భిక్ష్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతిని తెలిపారు.
కారేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ అవినీతికి తావులేకుండా పరిపాలన సాగిస్తున్నా కేసీఆర్ పట్ల ప్రజలలో ఆదరణ పెరుగుతుందన్నారు. ఎన్ని ఆర్థిక అవరోధాలు వచ్చినా ప్రజా సంక్షేమానికి కొరత లేకుండా పథకాలు అమలు చేస్తున్న ఘనత కేసీఆర్ దన్నారు. కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలను కోరారు. దానికి అనుగుణంగా వైరాలో జరిగే భారీ కార్యక్రమానికి తరలి రావాలని కోరారు.
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిక
కారేపల్లి మండలం గుంపెళ్లగూడెం, తులిశ్యాతండా, రావోజీతండా, కారేపల్లికి చెందిన వైఎస్ఆర్ టీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 కుటుంబాలు మాజీ ఎంపీటీసీ భూక్యా సోమ్లా, భూక్యా వీరన్న, బానోత్ రాములు ఆధ్వర్యంలో వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే బీ ఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వాంకుడోత్ జగన్, రైతు బంధు జిల్లా సభ్యులు ఉన్నం వీరేందర్, మాజీ రైతు బంధు మండల క న్వీనర్ హన్మకొండ రమేష్, ఎంపీటీసీ జడల వసంత, గుంపెళ్లగూడెం ఉపసర్పంచ్ ఎర్రబెల్లి దుర్గా శీను, బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు చందు నాయక్, బానోత్ రాజేష్. ధరావత్ వికాస్ రామారావు, హరీష్, తాత వెంకటేశ్వ ర్లు, డొంకెన రవీందర్, జవ్వాజి శ్రీనివాసరావు, ఎస్కే గౌసుద్దీన్, సోమందులు నాగరాజు, సర్దార్, గంగరబోయిన సత్యం తదితరులు పాల్గొన్నారు.