తెలంగాణ కోసం విరోచితంగా పోరాడిన కేసీఆర్ : ఎమ్మెల్యే రాములునాయక్

by Disha Web Desk 15 |
తెలంగాణ కోసం విరోచితంగా  పోరాడిన కేసీఆర్ : ఎమ్మెల్యే రాములునాయక్
X

దిశ, వైరా : తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ వీరోచితంగా పోరాడారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని కొనియాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ దశాబ్ద కాలంలో జాతీయస్థాయిలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టారని, అలాంటి మహా నాయకుడికి మూడవసారి ముఖ్యమంత్రి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

రెండవ సారి తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. ఎమ్మెల్యే రాములు నాయక్ కోలాట నృత్యాలు చేసి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు, వైరా జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, దిశ జిల్లా కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జునరావు, వైరా పట్టణ అధ్యక్షులు మద్దెల రవి, వైరా మండల పార్టీ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు దారెల్లి కోటయ్య, మరికంటి దేడికుమారి, దారెల్లి పవిత్ర కుమారి, తడికమళ్ళ నాగేశ్వరరావు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు షేక్ బేబా సాహెబ్ దేవాలయ చైర్మన్ మెట్టపల్లి సత్యంబాబు, భూమాత కృష్ణమూర్తి, వైరా పట్టణ నాయకులు కర్నాటి హనుమంతరావు ,ఎదునురు శీను, మరికంటి శివ పాల్గొన్నారు.


Next Story

Most Viewed