- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పోడు సాగుచేసే వారందరికీ హక్కు ఇవ్వని కేసీఆర్

దిశ, ములకలపల్లి : అందరికీ పోడు పట్టాలు ఇవ్వకుండా, అరకొర ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్న అధికార పార్టీ నేతలను గ్రామాలకు రావద్దని నిలదీయాలని సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. మంగళవారం ములకలపల్లి మండల కేంద్రంలో జరిగిన పోడు భూముల సమస్య పై సదస్సులో ఆయన మాట్లాడారు. అడవిని, అడవి భూములను ధ్వంసం చేస్తూ, కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు, ఫారెస్ట్ అధికారులే అప్పగిస్తున్నారని ఆరోపించారు.
ప్రజలు పోరాటాల ద్వారానే అటవీ హక్కుల చట్టం వచ్చిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పన్నెండు లక్షల ఎకరాలకు పట్టాలు ఇవ్వాల్సి ఉన్నదని, కేవలం నాలుగు లక్షల ఎకరాలకు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కెచ్చెల రంగయ్య, నాయకులు ముద్దా భిక్షం, అమర్లపుడి రాము, నూపా భాస్కర్, కల్లూరి కిషోర్, పోతుగంటి లక్ష్మణ్, నిమ్మల రాంబాబు, కల్లయ్య, దుర్గమ్మ, సంధ్య, సరోజిని, రామకృష్ణ, పద్మ, నకిరేకంటి నాగేశ్వరరావు, వై.రామారావు, శ్రీను పాల్గొన్నారు.