- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కారేపల్లి బంద్ విజయవంతం

దిశ, కారేపల్లి : కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘటనలో మృతులకు కంటి తుడుపు పరిహారం వద్దని రూ.కోటి, కాళ్లుకోల్పోయిన వారికి రూ.50 లక్షలు, గాయపడిన వారికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలంటూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో గురువారం కారేపల్లి బంద్ జరిగింది. ఈ బంద్కు సీపీఐ, బీజేపీలు మద్దతు ప్రకటించాయి. బంద్ సందర్బంగా కారేపల్లి దుకాణాలు మూసివేశారు. కారేపల్లి బస్టాండ్ సెంటర్లో అఖిల పక్షనాయకులు రాస్తారోకో చేశారు. ఈసందర్బంగా న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆనువూరి మధు మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా బీఆర్ఎస్ సభ నిర్వహించిందని చట్ట విరుద్దంగా వేలాదిమందిని సమీకరించారని విమర్శించారు.
ఈ ఘటనకు బీఆర్ఎస్ దే పూర్తి బాధ్యత వహించాలన్నారు. మృతులు, కాళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీ నాయకులు వై.ప్రకాష్, కంచర్ల శ్రీనివాసరెడ్డి, వై.జానకీ, కోయల శ్రీనివాస్, సీపీఐ నాయకులు బోళ్ల రామస్వామి, నాగవెళ్ళి సుధాకర్, బీజేపీ నాయకులు తురక నారాయణ, కాంగ్రెస్ నాయకులు మేదరి వీరప్రతాప్(టోనీ), బానోత్ హీరాలాల్, అటో యూనియన్ నాయకులు బద్దె రాము, దిండు సైదులు తదితరులు పాల్గొన్నారు.