- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆరోగ్య మహిళా సేవల్లో కామేపల్లి భేష్

దిశ,కామేపల్లి : ఆరోగ్య మహిళ పథకం మహిళలకు వరం అని జిల్లా ట్రైనీ కలెక్టర్ రాధిక గుప్తా పేర్కొన్నారు. మంగళవారం కామేపల్లి వైద్యశాలను రాధిక గుప్తా ఆకస్మికంగా సందర్శించి ఆరోగ్య మహిళా పథకం వైద్య సేవలను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం అని, ఆరోగ్య మహిళా పథకంతో ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. కుటుంబ సంక్షేమం, మహిళలు ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆరోగ్య మహిళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలకు 8 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఆరోగ్య మహిళా పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోనే ఆరోగ్య మహిళా సేవలు కామేపల్లి లో భేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్.చందన, డాక్టర్ బి. సౌజన్య, డాక్టర్ జి.తనుషా, వైద్య సిబ్బంది బి.ధూప్ సింగ్, బి. కళావతి, ఆర్.రమణ, పుష్పలత,కె. ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.