తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అందించేందుకే బీఆర్ఎస్ పార్టీ: ఎమ్మెల్యే సండ్ర

by S Gopi |
తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అందించేందుకే బీఆర్ఎస్ పార్టీ: ఎమ్మెల్యే సండ్ర
X

దిశ, సత్తుపల్లి : తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న పథకాలు దేశవ్యాప్తంగా ఆకర్షణీయంగా నిలిచాయని, దేశవ్యాప్తంగా ఈ పథకాలను ప్రజలకు అందించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేలకొల్పబడిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. సత్తుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేదింటి ఆడబిడ్డల పెళ్ళికానుక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకంలో మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పంపిణీ చేశారు. లబ్ధిదారులకు చెక్కుతోపాటు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పెళ్లికూతురుకు పెళ్లి కానుక తన సొంత ఖర్చులతో చీరను బహుకరణ చేశారు.

అనంతరం కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని, చేపట్టని సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని, నాటి ప్రభుత్వాలు ఎన్నడూ పేదింటి ఆడబిడ్డల పెళ్ళిలకు అండగా నిలవలేదని, వారిని కూడా ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో మిగిలిన గొప్ప ఆలోచన కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకం అని అన్నారు. అండగా నిలిచే ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ ఆశీస్సులు అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ , జిల్లా గ్రంధాలయ చైర్మన్ కొత్త ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, సత్తుపల్లి ఎంపీపీ గడ్డ శంకర్రావు హైమావతి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ తోట సుజల రాణి, వార్డ్ కౌన్సిలర్లు అద్దంకి అనిల్, దాడి రఘు, చాంద్ బాషా, గపార్, కంటి అప్పారావు, నట్టి ఆనందరావు, మండల బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed