- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఏబీసీడీ వర్గీకరణ సాధిస్తేనే న్యాయం జరుగుతుంది : మంద కృష్ణ మాదిగ

దిశ, కూసుమంచి : యాభై ఏండ్ల చరిత్రలో మాలలు 75 వేల ఉద్యోగాలు పొందితే అదే 50 ఏళ్ల చరిత్రలో మాదిగలు కేవలం రెండు శాతం ఉద్యోగాలు మాత్రమే పొందారని మహాజన సోషలిస్ట్ పార్టీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ అన్నారు. కూసుమంచి మండల కేంద్రంలోని యోగానంద రావు ఫంక్షన్ హాల్ లో జరిగిన పాలేరు డివిజన్ స్థాయి ఎంఆర్పిఎస్, మహాజన సోషలిస్ట్ పార్టీ నాలుగు మండలాల విస్తృతస్థాయి సమీక్ష సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పోరాడి వర్గీకరణ సాధించిన సమయంలో ఐదు సంవత్సరాలలో మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజలు 22 వేల ఉద్యోగాలు పొందగలిగారని తెలిపారు. మాలల్లోని జడ్జీలు కుట్రలు చేసి సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ జీవోను నిలుపుదల చేయించారని తెలిపారు. ఏబీసీడీ వర్గీకరణ సాధిస్తేనే మాదిగలకు, మాదిగ ఉపకులాల ప్రజలకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందని అన్నారు. కేసీఆర్ క్యాబినెట్లో మాదిగల స్థానం జీరో అని అన్నారు.
తెలంగాణను సాధించే సమయంలో వందలాది మంది మాదిగలు అమరులైనట్టు చెప్పారు. నాలుగు శాతం లేని రెడ్డి కులస్తులకు ఆరు మంత్రి పదవులు ఉన్నాయని, ఒకటి రెండు శాతం లేని కమ్మలకు ఒక మంత్రి పదవి ఉందని అన్నారు. రాష్ట్రంలో 14 శాతం ఉన్న మాదిగలకు ఎందుకు మంత్రి పదవులు దక్కలేదో కేసీఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ సాధించుకునే క్రమంలో హైదరాబాదులో జూన్ రెండు మూడు వారాలలో బహిరంగ సభకు పిలుపునివ్వనున్నట్టు పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు సురేష్ మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ సభలో మహాజన సోషలిస్ట్ పార్టీ పాలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ బొంగురు ఆనందరావు, మహాజన్ సోషలిస్ట్ పార్టీ జిల్లా పవిడి కత్తుల యాదయ్య, ఎంఎస్పీ జిల్లా నాయకులు కోట పెంజర బాలస్వామి, జిల్లా మహిళా నాయకురాలు ఎస్.కె యాకోబ్బి, ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా మండల నాయకులు తోళ్ళ వెంకన్న, కుక్కల రవీందర, పగిడిపల్లి బాబు, కుక్కల వడ్లమూడి వెంకటేశ్వర్లు, కుక్కల రవీందర్, కిన్నర నవీన్, మందుల సైదులు, ఒంగోలు వెంకన్న, తాపంగి కోటి, దోసపాటి సతీష్, శ్రీకాంత్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.