- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం

దిశ,ఇల్లందు : దేశం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు బాణోత్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. గురువారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక గోవింద్ సెంటర్ లోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 500 లకే గ్యాస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులకు రూ. 2 లక్షల పంట రుణం మాఫీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుత పాలక ప్రభుత్వాల వల్ల అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల ఇబ్బందులు, సమస్యలు పరిష్కరం కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. పోడు రైతులకు పట్టాలు ఇచ్చి ఆ భూమిపై హక్కు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తు చేశారు. ఉద్యోగాల కొరకు నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు నోటిఫికేషన్ ప్రకటించి పరీక్షలు నిర్వహించకుండా కాలయాపన చేయడం ఏమిటని ప్రశ్నించారు. పథకాల పేరుతో రూ. లక్షల కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు.
ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్న పాలక ప్రభుత్వాలపై ప్రజల్లో నమ్మకం లేదని, రానున్న ఎన్నికల్లో దేశ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీసీ మాజీ కార్యదర్శి బాణోత్ కిషన్ నాయక్, డా. బిందు పల్లవి, పట్టణ అధ్యక్షుడు దొడ్డ డానియల్, ఈశ్వర్ గౌడ్, మురళి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.