- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జర్నలిస్టులకు గుడ్ న్యూస్

దిశ, కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని దళిత జర్నలిస్టులకు అందించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు ఎమ్మెల్యే వనమా. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వ నూతనంగా ఏర్పాటు చేసిన దళిత బంధు పథకాన్ని ఈ నియోజకవర్గానికి కేటాయించిన 500 యూనిట్లలో 10 శాతం యూనిట్లు దళిత జర్నలిస్టులైన స్థానికులకు కేటాయించాలని టీయూడబ్ల్యూజే(ఐజెయు) యూనియన్ నాయకులు, జర్నలిస్టుల ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రస్తుతం మొదటి దఫాలో 20 మందికి ఇస్తానని, మిగిలినవారికి జనవరిలో కేటాయిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. 20 యూనిట్లను జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న దళిత జర్నలిస్టులకు కేటాయిస్తానని హామీ ఇచ్చిన వనమా వెంకటేశ్వరరావును జిల్లా అధ్యక్షుడు ఇమంది ఉదయ్ కుమార్, జర్నలిస్టుల బృందం సన్మానించింది. ఈ కార్యక్రమంలో ఏర్పుల సుధాకర్ రావు, దాసరి వెంకటేశ్వర్లు, ఎర్రఈశ్వర్, చీమకుర్తి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.