- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బీఆర్ఎస్ పై పూర్తి భరోసాతో పార్టీలో చేరికలు

దిశ, టేకులపల్లి : బీఆర్ఎస్ పై పూర్తి భరోసాతో గత 30 సంవత్సరాలగా న్యూ డెమోక్రసీ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఇల్లందు శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. ఇల్లందు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామానికి చెందిన 25 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భానోత్ లక్పతి, బండారి శ్రీను, నాన బాల భిక్షం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఇస్తామన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కష్టపడే వారికి ప్రతి స్థాయిలో గుర్తింపు ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అందరికీ అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు శ్రీరామరక్షగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో ముందంజలో ఉందని బీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారని, ఇతర పార్టీలకు తెలంగాణలో తావులేదని గమనించే వలసలు వస్తున్నట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో ఈర్ల సోమయ్య, సింగబోయిన నాగరాజు, నాన బాల లింగయ్య, బాసన బోయిన రమేష్, బండారి నరసయ్య, బింశి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్, ఉపాధ్యక్షులు చీమల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.