- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సీపీఐ నుంచి టీఆర్ఎస్లో చేరిక
by Sridhar Babu |

X
దిశ, ఖమ్మం రూరల్ : సీపీఐ నుంచి గురువారం రూరల్ మండలపార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు ఆధ్వర్యంలో నాయకులు, వార్డుమెంబర్లు, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరినవారికి ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్ఎస్కు పునాది అన్నారు. కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకోవడమే తన నైజం అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం ఉమ, జెడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, ఎంపీటీసీ కళింగరెడ్డి, మేదరమట్ల శ్రీను, ప్రతాపనేని రఘ, లింగయ్య, పేరం వెంకటేశ్వర్లు, మట్టా వెంకటేశ్వరరావు, జర్పుల లక్ష్మణ్, మంకెన నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
Next Story