సీపీఐ నుంచి టీఆర్​ఎస్​లో చేరిక

by Sridhar Babu |
సీపీఐ నుంచి టీఆర్​ఎస్​లో చేరిక
X

దిశ, ఖమ్మం రూరల్​ : సీపీఐ నుంచి గురువారం రూరల్​ మండలపార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు ఆధ్వర్యంలో నాయకులు, వార్డుమెంబర్లు, కాంగ్రెస్​ నాయకులు టీఆర్ఎస్​ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరినవారికి ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్​ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్​ఎస్​కు పునాది అన్నారు. కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకోవడమే తన నైజం అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం ఉమ, జెడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్​, ఎంపీటీసీ కళింగరెడ్డి, మేదరమట్ల శ్రీను, ప్రతాపనేని రఘ, లింగయ్య, పేరం వెంకటేశ్వర్లు, మట్టా వెంకటేశ్వరరావు, జర్పుల లక్ష్మణ్​, మంకెన నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.



Next Story