- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నిరుద్యోగులకు శుభవార్త...

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: జనవరి 7న జి.ఎస్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ట్రస్టు వ్యవస్థాపకులు, తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. శనివారం కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా కార్యక్రమ ఏర్పాట్లను ట్రస్టు చైర్మన్ గడల శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6500కు పైగా అభ్యర్థులు జాబ్ మేళాలో రిజిస్ట్రేషన్ అయ్యారని అన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు నేరుగా జాబ్ మేళాకు హాజరై ఉద్యోగం పొందాలని ఆయన ఆకాంక్షించారు. విద్యా, వైద్యం, ఉపాధి లక్ష్యంగా జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నామని అని ఆయన అన్నారు. మెగా జాబ్ మేళా ద్వారా సుమారు 7000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. నమోదు చేసుకోనివారు కూడా జాబ్ మేలలో పాల్గొనవచ్చని, నిరుద్యోగులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.