నిరుపేద కుటుంబానికి జేడీ ఫౌండేషన్ అండ

by Sridhar Babu |
నిరుపేద కుటుంబానికి జేడీ ఫౌండేషన్ అండ
X

దిశ, భద్రాచలం : పేద వాడి కళ్లల్లో సంతోషాన్ని చూడడానికి, బతుకుదెరువు కల్పించాలని జేడీ ఫౌండేషన్ సంకల్పించడం చాలా గొప్ప విషయం అని, ఆ దిశ గా ఇప్పటికే పలు చిరు వ్యాపారాలు ఏర్పాటు చేయడం అభినందనీయం అని భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కొత్తమార్కెట్ నందు రాజ్ కుమార్ దంపతులకు తోపుడు

బండి పై కూరగాయలు వ్యాపారంని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కంభంపాటి సురేష్ కుమార్ తో పాటు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జేడీ ఫౌండేషన్ ఉపాధి భరోసా కార్యక్రమం ద్వారా లబ్ది పొందిన వారు సంతోషంగా జీవిస్తున్నారు అని, ఉపాధి భరోసా ని స్ఫూర్తి తీసుకొని తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల ఇలాంటివి అమలు చేయడం గర్వించ దగ్గ విషయం అని తెలిపారు. జేడీ ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మీ నారాయణ అనుమతితో, కో ఆర్డినేటర్ మురళి మోహన్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఫౌండేషన్ బాధ్యులు హన్సి తెలిపారు.



Next Story

Most Viewed