రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ఐటీడీఏ పాఠశాల క్రీడాకారులు

by S Gopi |
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ఐటీడీఏ పాఠశాల క్రీడాకారులు
X

దిశ, పాల్వంచ: రాష్ట్ర స్థాయి పోటీలకు పాల్వంచ మండలం కిన్నెరసాని మోడల్ క్రీడా స్కూల్లో శనివారం ఐటీడీఏ పరిధిలోని స్కూళ్లకు చెందిన కీడాకారులను ఎంపిక చేశారు. ఈ పోటీలను ట్రైబల్ వెల్ ఫేర్ డీడీఆర్ రమాదేవి ప్రారంభించారు. అండర్ 19 బాల బాలికల భాగంలో వివిధ క్రీడాంశాల్లో రాష్ట్రాల్లోని వివిధ ఐటీడీఏల నుంచి 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కబడ్డీ, చెస్, అథ్లెటిక్స్, వాలీబాల్, క్రీడాంశాల్లో క్రీడాకారులను ఎంపిక చేసినట్టు స్పోర్ట్స్ ఆఫీసర్ వీరా నాయక్ తెలిపారు.



Next Story

Most Viewed