అంగన్వాడీ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని శాసనసభ లో చర్చిస్తా

by Sridhar Babu |
అంగన్వాడీ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని శాసనసభ లో చర్చిస్తా
X

దిశ, భద్రాచలం : అంగన్వాడీ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని శాసనసభలో చర్చిస్తానని ఎమ్మెల్యే వీరయ్య హామీ ఇచ్చారు. పలు సమస్యలపై అంగన్వాడీ సిబ్బంది ఎమ్మెల్యేను కలిసి వినతిప్రతం అందించారు. ఇందుకు ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ రానున్న అసంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ ను కలిసి ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రమోట్ చేసే అంశం తీసుకెళ్తాను అని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ హెల్పర్ లతో శ్రమ దోపిడీకి గురి చేస్తూ అదనపు పనులు కేటాయిస్తూ ఇబ్బందులు పాలు చేస్తున్నారు అని విమర్శించారు. ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ నాయకులు నోముల రాంరెడ్డి విశ్వనాథం, శివాజి, పూనెం నర్సమ్మ, సాధనపల్లి చిన్నారి, హేమలత, వేదభాయ్​, చెల్లాయిపాప నర్సమ్మ, ప్రభావతి పాల్గొన్నారు.



Next Story