- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సింగరేణిలో అప్రంటీస్ షిప్ కొరకు దరఖాస్తుల ఆహ్వానం

దిశ,ఇల్లందు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఇల్లందు ఏరియాలో ఐటీఐ పూర్తి చేసినవారికి అప్రెంటిస్ షిప్ లో చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మంగళవారం జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏరియా జీఎం ఎం.షాలెంరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇల్లందు ఏరియా లో ఐటీఐ లో వివిధ ట్రేడ్ల లో ఉత్తీర్ణులైన అభ్యర్ధులకు సింగరేణిలో ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ షిప్ చేసుకొనుటకు సింగరేణి యాజమాన్యం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
ఈ అప్రెంటిస్ షిప్ చేసుకొనుట కొరకు అర్హతలు ఎస్సి, ఎస్టి మరియు బిసి అభ్యర్ధులు 18 ఏండ్లు నిండి 33 ఏండ్ల లోపు వయసు కలిగి ఉండాలని, జనరల్ అభ్యర్ధులు మే 31.2023 తేదీ నాటికీ 18 సంవత్సరాలు నిండి 28 ఏండ్ల లోపు వయసు ఉండాలని అన్నారు. పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను ముందుగా ప్రభుత్వ వెబ్ సైడ్ www.apprenticeshipindia.org నందు నమోదు చేసుకొని తరువాత, సింగరేణి వెబ్ సైట్ www.scclmines.com/apprenticeship లో నమోదు చేసుకోవాలన్నారు. వెబ్ సైట్ దరఖాస్తు తోపాటు సంబందిత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను జతచేసి, స్థానిక సింగరేణి ఇల్లందు ఏరియాలోని ఎంవీటీసీ కార్యాలయం నందు ఈనెల 30వ తేదీలోపు అందజేయలన్నారు. మరిన్ని వివరాల కొరకు సింగరేణి వెబ్ సైట్ లేదా ఎంవిటీసి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.