పోక్సో యాక్ట్ , ఎస్సీ, ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతం చేయాలి : పోలీస్ కమిషనర్

by Sridhar Babu |
పోక్సో యాక్ట్ , ఎస్సీ, ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతం చేయాలి :   పోలీస్ కమిషనర్
X

దిశ, ఖమ్మం సిటీ : పోక్సో యాక్ట్ , క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్ , ఎస్సీ, ఎస్టీ , గ్రెవ్ కేసుల్లో విచారణ వేగవంతం చేసి చార్జ్ షీట్ సకాలంలో దఖాలు చేసేలా పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. శనివారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఖమ్మం కమిషనరేట్‌ అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు పై విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రతీ గ్రామంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యమై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు. కాలేజీలలో సైబర్ అవేర్నెస్ ప్రోగ్రాం, యాంటీ ర్యాగింగ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు.

చట్ట విరుద్ధంగా వ్యవహరించే క్రిమినల్స్, తీవ్రమైన నేరాలకు పాల్పడే నిందుతులపై పిడీ యాక్ట్ అమలు కోసం ప్రతిపాదన పంపాలని, ఆయా కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. పటిష్టమైన నిఘా వ్యవస్థ రూపొందించి జిల్లా సరిహద్దుల నుండి వచ్చే గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి తీవ్రమైన కేసులు నమోదు చేసి అక్రమ రవాణాను పకడ్బందీగా నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ వారీగా పలు నేరాలపై సమీక్ష జరిపారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ (ఎల్&ఓ) సుభాష్ చంద్రబోస్, అడిషనల్ డీసీపీ (ఏ ఆర్) కుమారస్వామి, ఏసీపీలు గణేష్,రామోజీ రమేష్, రెహమాన్, ప్రసన్న కుమార్, రామానుజన్, వెంకటస్వామి, రవి, పాపారావు, సీసీఆర్బి సీఐ గోపి, వివిధ పోలీస్ స్టేషన్ ల సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.



Next Story