భద్రాచలంలో సర్వమత శాంతి ర్యాలీ

by Sridhar Babu |
భద్రాచలంలో సర్వమత శాంతి ర్యాలీ
X

దిశ, భద్రాచలం : మణిపూర్ లో జరుగుతున్న హింసాకాండను నివారించాలని, భారతదేశంలో శాంతి నెలకొల్పాలని కోరుతూ భద్రాచల పట్టణ ప్రజలు, స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు, మత పెద్దలు ఐక్యంగా పట్టణంలో శాంతి ర్యాలీని నిర్వహించారు. ఈ శాంతి ర్యాలీకి బ్లడ్ డోనర్స్ ఆర్గనైజర్ జిందా, ఎస్ కే అజీమ్, గడ్డం స్వామి,సరెళ్ల నరేష్, సునీల్, వెంకటరెడ్డి, మున్నాఫ్ తో పాటు వివిధ చర్చిల పాస్టర్లు పాల్గొని భారతదేశంలో శాంతి కాపాడాలని నినదించారు. ఈ సందర్భంగా

వారు మాట్లాడుతూ భారతదేశంలో అనేక ప్రాంతాలలో మతం పేరుతో విధ్వంసాలు జరుగుతున్నాయని, ఇది లౌకిక దేశానికి ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో మతసామరస్యాన్ని శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత పాలకులపై ఉందని గుర్తు చేశారు. మణిపూర్ లో హింసను నివారించి శాంతిని నెలకొల్పాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీలు, మత పెద్దలు, స్వచ్ఛంద సేవా నిర్వాకులు, అధిక సంఖ్యలో పాల్గొని పట్టణ పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు.



Next Story