- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సమగ్రాభివృద్ధే లక్ష్యం

దిశ, ఖమ్మం రూరల్ : నియోజకవర్గ సమాగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు, దానిలో భాగంగానే పాలిటెక్నిక్ కళాశాల, ఫిషరీస్ కళాశాలతో పాటు జేఎన్టీయూహెచ్ కళాశాల మంజూరు చేయించానని పాలేరు శాసనసభ సభ్యుడు కందాల ఉపేందర్రెడ్డి అన్నారు. మంగళవారం రూరల్ మండలం పోలేపల్లి పరిధిలో రూ.59 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్లకు ఎమ్మెల్యే కందాల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రూరల్ మండలంలో పల్లెగూడెం– మంగళగూడెం
వరకు రూ. 55కోట్ల వ్యయంతో రెండు వరుసల రహదారి నిర్మాణానికి నిధులు కేటాయింపులు జరిపినట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు ఏదులాపురం, పెద్దతండా తదితర పంచాయతీలకు ఎస్డీఎఫ్ నిధుల కింద సీసీ రోడ్ల నిర్మాణం జరుపుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం మరోసారి రావాలంటే వచ్చే ఎన్నికల్లో తతను మరోసారి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం ఉమ, జెడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, అక్కినపల్లి వెంకన్న, సుడా డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి, ప్యాక్ చైర్మన్ జర్పుల లక్ష్మణ్నాయక్, ముత్యం క్రిష్ణరావు, వైస్ ఎంపీపీ దరగయ్య ఉన్నారు.