సమగ్రాభివృద్ధే లక్ష్యం

by Sridhar Babu |
సమగ్రాభివృద్ధే లక్ష్యం
X

దిశ, ఖమ్మం రూరల్​ : నియోజకవర్గ సమాగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు, దానిలో భాగంగానే పాలిటెక్నిక్​ కళాశాల, ఫిషరీస్​ కళాశాలతో పాటు జేఎన్​టీయూహెచ్​ కళాశాల మంజూరు చేయించానని పాలేరు శాసనసభ సభ్యుడు కందాల ఉపేందర్​రెడ్డి అన్నారు. మంగళవారం రూరల్​ మండలం పోలేపల్లి పరిధిలో రూ.59 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్లకు ఎమ్మెల్యే కందాల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రూరల్ మండలంలో పల్లెగూడెం– మంగళగూడెం

వరకు రూ. 55కోట్ల వ్యయంతో రెండు వరుసల రహదారి నిర్మాణానికి నిధులు కేటాయింపులు జరిపినట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు ఏదులాపురం, పెద్దతండా తదితర పంచాయతీలకు ఎస్​డీఎఫ్​ నిధుల కింద సీసీ రోడ్ల నిర్మాణం జరుపుతున్నట్లు తెలిపారు. కేసీఆర్​ ప్రభుత్వం మరోసారి రావాలంటే వచ్చే ఎన్నికల్లో తతను మరోసారి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం ఉమ, జెడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్​, బీఆర్​ఎస్​ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, అక్కినపల్లి వెంకన్న, సుడా డైరెక్టర్​ గూడ సంజీవరెడ్డి, ప్యాక్​ చైర్మన్​ జర్పుల లక్ష్మణ్​నాయక్​, ముత్యం క్రిష్ణరావు, వైస్​ ఎంపీపీ దరగయ్య ఉన్నారు.



Next Story

Most Viewed