- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ

దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి మండల పరిధిలోని రామానగరం, అయ్యగారిపేట తదితర ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం జిల్లా వ్యవసాయ అధికారి ఎం విజయనిర్మల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో కూపన్లు పంపిణీ, ధాన్యంలో తేమ శాతం పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై సహకార సంఘం అధ్యక్షులు రైతుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొనుగోలు ప్రక్రియలు, ఇబ్బందులను రైతులు జిల్లా వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకురాగా ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
అనంతరం గంగారం గ్రామంలో గల సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లను సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ డీ ఏ లు వి. శ్రీనివాసరెడ్డి ,వి. నరసింహారావు, మండల వ్యవసాయ అధికారి వై. శ్రీనివాసరావు ,సర్పంచ్ శ్రీనివాసరెడ్డి ,డీసీసీ డైరెక్టర్ చల్లగుళ్ళ కృష్ణయ్య, సొసైటీ అధ్యక్షులు చిలుకూరి కృష్ణమూర్తి ,వెంకటరెడ్డి శివరాం ప్రసాద్, ఏ ఈ ఓ లు స్వాతి నరేష్, ఆశా జ్యోతి పాల్గొన్నారు.