'సామాన్యుడి సమస్యలు కనపడని కేసీఆర్ పెద్ద వికలాంగుడు'

by Vinod kumar |
సామాన్యుడి సమస్యలు కనపడని కేసీఆర్ పెద్ద వికలాంగుడు
X

దిశ, చండ్రుగొండ: తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం (టీవీపీఎస్) ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ అడ్డాలో నిర్వహించనున్న దివ్యాంగ సంకల్ప దీక్ష కరపత్రాన్ని శుక్రవారం చండ్రుగొండ జడ్పీటీసీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొడకండ్ల వెంకట్ రెడ్డి ఆయన స్వగృహంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల హక్కులను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని, ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఉద్యోగావకాశాలు, ఉపాధిలో పట్టభద్రులైన దివ్యాంగులు అనేక సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దివ్యాంగులు తమ డిమాండ్ల సాధనకై రోడ్డెక్కే దుస్థితి కల్పించిన టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గుపడాలని, సామాన్యుడి సమస్యలు కనపడని కేసీఆరే వీరికంటే పెద్ద వికలాంగుడని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దివ్యాంగులందరికీ పింఛన్ అందిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ రకాల కారణాలతో ఉన్న పింఛన్లను తొలగించి సగం మందికి మాత్రమే ఆసరా పెన్షన్ ఇస్తుందని, వాటిని కూడా రెండు నెలలుగా దివ్యాంగులకు, వృద్ధులకు అందించలేదని అన్నారు.

నిజంగా కేసీఆర్‌కి మానవత్వం ఉంటే వీరి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని హెచ్చరించారు. ఈ నెల 15న కొత్తగూడెంలో దివ్యాంగుల చేపట్టిన దివ్యాంగ సంకల్ప దీక్షకు రాజకీయ పార్టీలకు అతీతంగా మద్దతుగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీవీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు వీజేఏసీ చైర్మన్ సతీష్, సభ్యులు ఖాసిం, కిరణ్, రాములు, బాబా, హుస్సేన్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed