రసవత్తరంగా మారిన ఇల్లెందు మున్సిపల్ రాజకీయం.. క్యాంపుల్లో అసమ్మతి కౌన్సిలర్లు

by Mahesh |
రసవత్తరంగా మారిన ఇల్లెందు మున్సిపల్ రాజకీయం.. క్యాంపుల్లో అసమ్మతి కౌన్సిలర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ రాజకీయం రసవత్తరంగా మారింది. మున్సిపల్ చైర్మన్‌కు వ్యతిరేకంగా నిన్న అవిశ్వాస తిర్మానాన్ని పెట్టారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ పెద్దలు, ఎమ్మెల్యే.. అసమ్మతి కౌన్సిలర్లతో మంతనాలు జరపుతున్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై మొత్తం 16 మంది కౌన్సిలర్లు సంతకం చేశారు.

ఇందులో కొంత మంది ప్రస్తుతం క్యాంపుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. చైర్మన్ మద్దతు వర్గం ప్రస్తుతం ఇల్లెందు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన దిగారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ కౌన్సిలర్లు అంతా. అక్కడే కుర్చోని ధర్నా చేశారు.



Next Story