- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోండి.. మున్సిపల్ చైర్మన్

దిశ, ఇల్లందు: కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ.. జనవరి 18న ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం ఖమ్మం నుంచి ప్రారంభం అవుతుందని చెప్పారు. ఇల్లందు పట్టణంలో 19వ తారీఖున 7 వార్డు, 19వ వార్డులోని మామిడి చెట్ల బడి, గర్ల్స్ హై స్కూల్ నందు ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ చేతుల మీదుగా కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు.
ప్రతి వార్డులో వారం రోజులపాటు ఈ కార్యక్రమం అందుబాటులో ఉంటుందన్నారు. వారంలో ప్రతి శనివారం, ఆదివారం సెలవు ఉంటుందన్నారు. 12 మంది కంటి వైద్యులు రెండు గ్రూపులుగా ఇల్లందు పట్టణంలోని 24 వార్డులలో వంద రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పారు. వీరికి తోడుగా మునిసిపల్ సిబ్బంది, ఆశ వర్కర్లు, మెప్మా సిబ్బంది ఉంటారన్నారు. దృష్టిలోపం తక్కువ ఉన్నవారికి కండ్లను పరీక్షించి అద్దాలను అక్కడే ఇస్తారన్నారు. కంటి వెలుగు కార్యక్రమానికి వచ్చేవారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ,ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చుకోవాలని సూచించారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు కంటి వెలుగు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంకుష్ షావలి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.