వరద ప్రాంతాన్ని పరిశీలించిన ఐజీ

by Sridhar Babu |
వరద ప్రాంతాన్ని పరిశీలించిన ఐజీ
X

దిశ, బూర్గంపాడు : బూర్గంపాడు మండల కేంద్రంలో ప్రస్తుతం ఉన్న పోలీసు స్టేషన్ పక్కన నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని శనివారం ఉదయం ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సందర్శించారు. గతేడాది వచ్చిన గోదావరి వరదలకు ఇది నీట మునిగింది. ఈనెల 27వ తేదీన ఈ స్టేషనును ప్రారంభించనున్నారని సమాచారం అనంతరం మండల కేంద్రంలోని ఆంధ్రా, తెలంగాణ సరిహద్దులో గల బ్రిడ్జి సమీపంలో వరద ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయతో పాటు జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం, స్థానిక ఎస్ఐలు ఉన్నారు.



Next Story