- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కేసీఆర్ పై అవాక్కులు పేలితే.. నాలుక చీరేస్తాం.. : తాతా మధు

దిశ, ఖమ్మం : ఆర్థిక బల అహంకారంతో దళిత సామాజికవర్గ శాసనసభ్యులపై నీ ప్రతాపం చూపించాలనుకుంటున్నావా అని, కేసీఆర్ పై అవాక్కులు పేలిస్తే.. నాలుక చీరేస్తాం అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సత్తుపల్లి నియోజకవర్గంలో సండ్ర వెంకట వీరయ్య గెలుపు ఖాయమని, ఆర్థిక ధన బలంతో విర్రవీగుతున్న శ్రీనివాస్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా ఖమ్మం జిల్లాలో రవ్వ గింజంత ప్రభావం కూడా ఉండదని దుయ్యబట్టారు. చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో రాజకీయ అజ్ఞానిగా మిగిలిపోతావని విమర్శించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్గ పోరుకు కేరాఫ్ అయిన కాంగ్రెస్ నీ చేరికతో నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఆర్థిక, రాజకీయ ప్రయోజనం కొరకే శ్రీనివాస్ రెడ్డి ఉబలాటం అనే విషయం జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి సంక్షేమంతో ముందుకు తీసుకుని వెళ్తున్న మహానేత కేసీఆర్ పై నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని, నాలుక చీరేస్తాం.. ఖబర్దార్ జాగ్రత్త అని హెచ్చరించారు .దళిత సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యుల నియోజకవర్గం వారిని ఓడించడమే లక్ష్యంగా ఒక పార్టీని వేదికగా చేసుకొని కుట్ర పన్నుతున్న విషయాన్ని సామాన్య ప్రజలు సైతం అవగతం చేసుకున్నారని, రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో శ్రీనివాస్ రెడ్డి ఒక రాజకీయ అజ్ఞానిగా మిగిలిపోవడం ఖాయమని తెలిపారు.
ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఖమ్మం జిల్లా ప్రజలు ఉన్నారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు ఎన్ని డ్రామాలు చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిచి, ముఖ్యమంత్రి కేసీఆర్ ను మూడోసారి అధికారంలోకి తేవడం ఖాయమని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం జిల్లా యూత్ అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు ఉప్పల వెంకటరమణ , బొమ్మెర రామ్మూర్తి , ఖమ్మం రూరల్ మండల పార్టీ ప్రెసిడెంట్ బెల్లం వేణు, ఇల్లందు నియోజకవర్గ నాయకులు యలమద్ది రవి , లింగన్న సతీష్, పగడాల నరేందర్ పాల్గొన్నారు.