- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రోడ్డు మరమ్మతులు చేపట్టకపోతే ప్రత్యక్ష పోరాటాలే

దిశ, బోనకల్ : బోనకల్ నుంచి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారి మరమ్మతులు చేపట్టకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని బోనకల్ నుంచి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిని సీపీఐ బృందం శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
నిత్యం బోనకల్ నుంచి ఖమ్మం వెళ్లే రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు నరకయాతనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై పెద్ద గుంటలు పడడంతో అత్యవసర సమయాల్లో 108 వాహనాలు, అంబులెన్స్, ఇతర వాహనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. రోడ్డు దెబ్బతిని గుంటల పడ్డ ప్రదేశాలల్లో వర్షపు నీరు చేరి ప్రమాదకరంగా మారాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిసారించి రోడ్డుమరమ్మతులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు తూము రోషన్ కుమార్, బొమ్మినేని కొండలరావు, పగిడిపల్లి యేసు, సహాయ కార్యదర్శి ఆకెన పవన్, మండల నాయకులు సాధనపల్లి ఆమర్నాద్ తదితరులు పాల్గొన్నారు.