- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కాంగ్రెస్ వస్తే మళ్లీ పవర్ హాలిడేలే

దిశ, ఇల్లందు : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పవర్ హాలిడేలు ప్రకటిస్తారని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం సుదిమల్ల గ్రామపంచాయతీ లోని రైతు వేదిక వద్ద వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మూడు పంటల బీఆర్ఎస్ కావాలా మూడు గంటల కాంగ్రెస్ కావాలా అనే నినాదం తో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే హరి ప్రియ నాయక్ మాట్లాడారు.
24 గంటల ఉచిత విద్యుత్ ఓర్వలేకనే రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తుంటే తట్టుకోలేని రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తూ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నాడన్నారు. 2014 కి ముందు కాంగ్రెస్, టీడీపీ పాలనలో వ్యవసాయ రంగానికి కరెంట్ అంటే లోఓల్టేజీ, మోటార్లు కాలడం, ట్రాన్స్ఫార్మర్లు పేలడం, రాత్రి వేళలో పాము, తేలుకాట్లతో రైతులు చనిపోవడం ,పంట ఎండిపోవడం జరిగేవని తెలిపారు. కాలేశ్వరం తో పాటు పెండింగ్ లో ఉన్న 30 ప్రాజెక్టులను, వేలాది చెక్ డ్యాంలను పూర్తిచేసుకుని తెలంగాణను కోటి ఎకరాల మాగాని చేశారని తెలిపారు.
ధైర్యం ఉంటే మూడు గంటల కరెంటు చాలనే అంశాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు రావాలని రేవంత్ కు సవాల్ విసిరారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, వైస్ ఎంపీపీ ధ్యాసం ప్రమోద్, సర్పంచ్ కుంజ కృష్ణ, వల్లాల మంగమ్మ, పీఏసీఎస్ చైర్మన్ మెట్ల కృష్ణ , శీలం రమేష్, ఖమ్మంపాటి రేణుక, తాండ్ర నాగరాజు, గిన్నారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.