పాలేరులో పోటీ చేసేది నేనే... గెలిచేది నేనే : ఎమ్మెల్యే కందాళ

by Sridhar Babu |
పాలేరులో పోటీ చేసేది నేనే... గెలిచేది నేనే : ఎమ్మెల్యే కందాళ
X

దిశ, కూసుమంచి : పాలేరులో కొంతమంది కమ్యూనిస్టులు మేమే పోటీ చేస్తామని ప్రచారం చేసుకుంటున్నారని కానీ కమ్యూనిస్టులకు ఓట్లు వేసే రోజులు పోయాయని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ అన్నారు. కూసుమంచి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం పాలేరు నియోజకవర్గ దైవ సేవకుల (పాస్టర్ ) ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్యే కందాళ మాట్లాడుతూ... పాలేరు లో ఖచ్చితంగా పోటీ చేసేది తానేనని, మీ అందరి ఆశీర్వాదంతో గెలిచేది తానేనని అన్నారు.

తాను మంచి చేశాను అనుకుంటేనే మీరు ఓటేయండి అని అన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి నిలబడేది తానే అని స్పష్టం చేశారు. 24 గంటలు ప్రజావసరాల మేరకు పనిచేస్తానని వార్ వన్ సైడేనని అన్నారు. పాలేరులో కొంతమంది తామే పోటీ చేస్తామని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ నాయక్, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరు శేఖర్, రూరల్ ఎంపీపీ బెల్లం ఉమా, జెడ్పీటీసీ వరప్రసాద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేముల వీరయ్య, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆసిఫ్ ఫాషా, రామసహాయం బాలకృష్ణ రెడ్డి, పాస్టర్ లు, దైవ సేవకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed