- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అటవీ అధికారులపై హెచ్ఆర్సీ విచారణ.. తెరపైకి సాకివాగు ఘటన..

దిశ, ములకలపల్లి: గొత్తి కోయలను అటవీ శాఖ అధికారులు బలవంతంగా వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు, వారి భూములు గుంజుకొని వాటిల్లో మొక్కలు వేస్తూ వారి జీవనాన్ని చిన్నా భిన్నం చేస్తున్నట్లు జాతీయ మానవ హక్కుల కమీషన్కు 2021 లో సుప్రీంకోర్టు లాయర్లు ఆల్టర్ నెట్ లీగల్ ఫోరం ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. దీనిపై రెండు తెలుగు రాష్ట్రా ప్రభత్వాలను మానవ హక్కుల కమిషన్ వివరణ కోరారు. ఇలాంటి ఘటనలు ఏవీ తమ రాష్ట్రాల పరిధిలో జరగలేదని నివేదిక అందజేశారు. సంతృప్తి చెందని కమిషన్ బాధితులతో నేరుగా కలిసి విచారణ చేసేందుకు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం ఏనుగు అప్పయ్య నగర్ (గొత్తికోయల గ్రామం) లో మానవ హక్కుల కమిషన్ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి ఎం. మదన్ గోపాల్ (రిటైర్డ్ ఐఏఎస్) అధికారి నేతృత్వంలో విచారణ సాగింది.
ఇది గ్రామానికి చెందిన సోడే చుక్కయ్య ఫిర్యాదు దారుడిగా ఉండగా నేరుగా చుక్కయ్య తో మదన గోపాల్ గ్రామస్థులు, వివిధ స్వచ్ఛంద సేవ సంస్థల ప్రతినిధుల సమక్షంలో విచారణ జరిపారు. బాధితులు చెప్పిన విషయాలను మదన్ గోపాల్ నివేదిక రూపంలో కమిషన్ కుదించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్ లక్ష్మి, భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్, అటవీ శాఖ సీసీఎఫ్ బీమా, డీఎఫ్ఓ రంజిత్ నాయక్, ఏఎస్టీఎస్ డైరెక్టర్ గాంధీ బాబు, ఎఫ్డీఓ తిరుమలారావు, ఎంపీడీఓ చిన్న నాగేశ్వరావు, రేంజర్ రవికిరణ్, ఆర్ఐ తారాచంద్, స్వచ్ఛంద సేవా ప్రతినిధులు రాజ్ కుమార్, చార్వాక, ఊక ముక్తేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తెరమీదకు సాకివాగు బాధితుల ఘటన..
గత సంవత్సరం అటవీ అధికారులు సాకివాగు గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలపై అటవీ శాఖ గార్డు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో బాదితులు మానవ హక్కుల కమీషన్కు కలిశారు. ఆ ఘటనలో బాధితులకు ఎలాంటి న్యాయం చేయకపోగా.. బాధ్యులైన అటవీ శాఖ అధికారిపై ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంపై మదన్ గోపాల్ను బాధితులు కలిశారు. బాధితులతో మదన్ నేపాల్ విడిగా సమావేశమయ్యారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. న్యాయం జరిగేలా చూస్తానని చెప్పినట్లు బాధితులు తెలిపారు.
ఇదే క్రమంలో ఇటీవల రాచన్నపేట గ్రామంలో గిరిజన కుటుంబాల బహిష్కరణ విషయంలో స్థానిక ఎస్సై సాధారణ కేసు నమోదు చేసి నిందితులకు సహకరిస్తున్నారని, దీంతో తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఫిర్యాదు చేశారు. పక్కనే ఉన్న ఐటీడీఏ పీవో కు అందజేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఆదిమ ఆదివాసుల సంక్షేమ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో వివిధ సమస్యలతో కూడిన వినతి అందజేశారు. ఈ కార్యక్రమంలో సోయం చిన్నారి, బెడిసి భిక్షం, అరేం ప్రశాంత్, న్యూడెమోక్రసీ నాయకులు పోతుగంటి లక్ష్మణ్, కల్లూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.