అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

by Sridhar Babu |
అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
X

దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి మండలం తుమ్మూరు గ్రామంలో గురువారం సీపీఎం ఆధ్వర్యంలో భూ సదస్సు మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో హాజరైన సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆవస్ యోజన పథకం కింద పేదలకు ఇండ్లు నిర్మిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని, అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇస్తామని అధికారంలోకి వచ్చి పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

తుమ్మూరు గ్రామంలో 32 సర్వే నెంబర్ లో సుమారు 25 ఎకరాల ప్రభుత్వ భూములను కొంతమంది ఆక్రమించుకున్నారని, వారి స్వాధీనంలో ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, సీపీఎం జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు, వేపులపాటి కుమారస్వామి, కాకాని శ్రీనివాసరావు, హసావత్ కృష్ణ, బండి వేలాద్రి, ముత్తిని శ్రీను, విష్ణు వాసు, సామ్రాజ్యం, ఏసమ్మ, కుమారి, సాంబశివ, కిషోర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.



Next Story