- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సర్కార్ పాఠశాలలకు అధిక ప్రాధాన్యం : ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

దిశ, బూర్గంపాడు : సర్కార్ పాఠశాలలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. బూర్గంపాడు మండల పరిధిలోని అంజనాపురం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం తెలంగాణ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా రూ.42.27 లక్షల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మనబడి కార్యక్రమం ద్వారా గ్రామాలలో పాఠశాలల రూపురేఖలు మారిపోయాయన్నారు.
సర్కార్ పాఠశాలలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మనఊరు-మనబడితో స్వరూపాన్ని మార్చడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దేదెందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సర్కార్ స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. మనఊరు-మనబడి కింద అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువజన విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.