- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చెరువులో మట్టి మాయం.. పట్టించుకోని అధికారులు..

దిశ, వేంసూర్ : వేంసూర్ మండలం మర్లపాడు గ్రామంలో ఉన్న కొత్తచెరువు నుండి భారీ ఎత్తిన మట్టి అక్రమంగా తరలిస్తున్నారు. వేంసూర్ మండలంలో నిర్మితమవుతున్న గ్రీన్ ఫీల్డ్ రహదారికి టిప్పర్ లతో మట్టిని తరలిస్తున్నారు. జేసీబీలతో చెరువులో పెద్ద పెద్ద గోతులు తవ్వుతున్నారు. ఇంత భారీ ఎత్తున మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులలో చలనం లేదని, ఇది రాజకీయనాయకులు, ప్రభుత్వ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందని ప్రజలు వాపోతున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఒకవైవు టిప్పర్ల సౌండ్, మనుషులు కూడా కనపడని దుమ్ము, ధూళితో నిండిన రహదారుల పై ముందు ఏ వాహనం వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
అనుమతులు లేకుండా ఇంత భారీ ఎత్తున అక్రమంగా మట్టిని తరలిస్తుంటే రెవెన్యూ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ పట్టించుకునే పాపాన లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యజమానులు కేవలం ధన దాహంతో విచ్చల విడిగా మైనింగ్ కు పాల్పడుతున్నారని అంటున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు భూముల్లో మట్టి తవ్వకానికి జిల్లా అధికారులు సిఫార్సు మేరకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఆధారంగా తహశీల్దార్ ప్రత్యేక అనుమతులు ఇస్తారు. కానీ నిబంధనలు అన్ని తుంగలో తొక్కి, కొండలు, గుట్టలు, ప్రభుత్వ భూములలో సైతం, చివరకు చెరువులలో శిఖం భూములలో సైతం పెద్ద పెద్ద గోతులు పెట్టి మట్టి తవ్వుతున్నారు.
ప్రభుత్వ భూముల్లో ఎక్కడ తవ్వకాలు జరిపినా హెక్టార్ కు యాభై వేలు, గనుల శాఖకు మరో యాభైవేలు రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాలి. కానీ ఇవేమీ చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండి కొడుతూ యధేచ్చగా చెరువుల్లో మట్టి తరలిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అండతోనే దందా మట్టి రవాణా గూర్చి పలుసార్లు పత్రికలలో వార్తలు వచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, వార్తలు ప్రచారం అయినప్పుడు కొన్ని రోజులు పనులను ఆపి సద్దుమనిగాక మళ్ళీ విజృంభించి అక్రమ రవాణా జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. అధికారులే అక్రమార్కులకు వెన్నుదన్నులా ఉన్నారని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని ప్రకృతి సంపద కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.