- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అప్పు తీర్చేందుకు..... దొంగగా మారాడు

దిశ, వైరా : తనకున్న అప్పును తీర్చేందుకు ఓ ట్రాక్టర్ డ్రైవర్ దొంగగా మారాడు.... తొలి ప్రయత్నంలోనే ఆ దొంగ పోలీసులకు పట్టుబడ్డాడు.... చివరకు కటకాల పాలయ్యాడు.... వైరా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.... వైరా పాత బస్టాండ్ సెంటర్ లో కాంగ్రెస్ కార్యాలయం పక్కన కిరాణా దుకాణంలో ఈనెల 24న ఓ వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును అపహరించుకుపోయిన దొంగను పోలీసులు అరెస్టు చేసి మధిర కోర్టుకు రిమాండ్ చేశారు. వైరా మున్సిపాలిటీ 1వ వార్డులోని బీసీ కాలనీకి చెందిన చింతమాల సంసోన్ వైరా ఎస్ఐ శాఖమూరి వీరప్రసాద్ అరెస్టు చేసి శుక్రవారం రాత్రి మధిర కోర్టుకు రిమాండ్ చేశారు. ఇటుక బట్టీల వద్ద ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న సంసోన్ కొత్తగా ఇల్లు కట్టడంతోపాటు, తన కుమార్తె డెంగ్యూ జ్వరం బారిన పడటంతో అప్పులు చేశాడు.
వాటిని తీర్చేందుకుగాను దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే మొదటి ప్రయత్నంలోనే విఫలమై పోలీసులకు దొరికిపోయాడు. ఈనెల 24 సాయంత్రం 3.30 గంటల సమయంలో కాంగ్రెస్ కార్యాలయం పక్కన ఓ కిరాణ దుకాణంలో ఉన్న వజినేపల్లి గృహలక్ష్మీ అనే వృద్దురాలిపై రాయితో దాడిచేసి ఆమె మెడలోని 24 గ్రాముల బంగారు గొలుసును తెంచుకొని పారిపోయాడు. మొఖానికి మాస్క్ ధరించి ఉన్నప్పటికీ సంసన్ ఫొటోలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఆ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో స్థానికులు పోలీసులకు సంసోన్ గా అనుమానించి సమాచారమివ్వడంతో ఖమ్మం లోని కరుణగిరి సమీపంలో ఇటుకబట్టీల వద్ద ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న సంసోన్ ను అదుపులోకి తీసుకొని బంగారు గొలుసును రికవరీ చేశారు. ఆ తర్వాత అతడిని మధిర కోర్టుకు రిమాండ్ చేశారు.