- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
యువత బలిదానాలతో తెలంగాణ సిద్ధించిందని మర్చిపోయారా...? : పొంగులేటి

దిశ, సత్తుపల్లి : ‘యువత బలిదానాలతో... మేధావుల ఆత్మహుతితో... అనేక మంది శ్రమ, కృషితో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం మర్చిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే యువతకు ఉద్యోగాలు వస్తాయని... నిరుద్యోగ భృతి అందుతుందని కన్న కలలు కల్లలుగానే మిగిలిపోయాయి... ఎన్నికలు వచ్చినప్పుడు నోటిఫికేషన్లు రావడం పరిపాటిగా మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చాం... ఎంతమందికి అపాయింట్ మెంటు ఆర్డర్లు ఇచ్చాం అనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది’ అని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని ఎంఆర్ గార్డెన్స్ లో రైటాఛాయిస్ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కు ముఖ్యఅతిథిగా హాజరైన పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదన్నారు.
తల్లిదండ్రులు, గురువులు, తోబుట్టువులు కన్న కలలు నేరవేర్చాలని నిరుద్యోగులు తాపత్రయపడుతుంటే ఆ కలలను కల్లాలుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంచుతుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సుమారు 80వేల ఖాళీలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య లక్షకు దాటిందని అయినా వాటి భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోకపోవడం సిగ్గుచేటన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యువత మద్ధతు తనకు కావాలని కోరారు. యువత తలచుకుంటే ఏదైనా సాధ్యమనే విషయాన్ని రాబోయే ఎన్నికల ద్వారా మరోమారు నిరూపితం చేయాలని పిలుపునిచ్చారు. అధికారం ఉన్నా... లేకున్నా అన్ని విధాల తన అండదండలు ఉంటాయని యువతకు హామీ ఇచ్చారు. నిరుద్యోగుల పక్షాన నిలబడుతూ వారి కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న రైట్ ఛాయిస్ మెండెం కిరణ్ కుమార్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
యువతలో ఉత్తేజం కలిగింపజేసేందుకు ఇలాంటి సెమినార్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని కిరణ్ కుమార్ను కొనియాడారు. రాబోయే రోజుల్లో కిరణ్ సహకారంతో తన ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో జాబ్ మేళాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా అనేకమంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటిని గజమాలతో ఘనంగా సత్కారించారు. విద్యార్థిని విద్యార్థులు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు తదితరులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.