- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రైతు సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించాలి

పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: రైతు సంక్షేమం కోసం మార్కెట్ కమిటీలు అహర్నిశలు శ్రమించాలని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నూతనంగా ఎన్నికైన బోయిన్ పల్లి మర్కెట్ పాలకవర్గ సభ్యులు ఆదివారం మంత్రిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని మర్కెట్ కమిటీ నూతన చైర్మన్ హరికా అనంద్ బాబు, డైరెక్టర్లు మాడిశెట్టి గిరిధర్, దేవులపల్లి శ్రీనివాస్, శ్రీరాముల ప్రభాకర్ వేర్వేరుగా కలిసి మంత్రిని శాలువాతో సత్కరించి, పష్పగుచ్ఛం అందజేశారు. తమకు అవకాశం కల్పించినందుకు మంత్రికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రైతు సంక్షేమం కోసం మర్కెట్ కమిటీలు అహర్నిశలు శ్రమించాలని సూచించారు. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వొమ్ము చేయకుండా పని చేయాలని కోరారు. అదేవిధంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్నను కమిటీ సభ్యులు తన క్యాంపు కార్యాలయంలో మార్యదపూర్వకంగా కలిశారు.