- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
విద్యుదాఘాతంతో గురుస్వామి మృతి

దిశ, టేకులపల్లి : విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన టేకులపల్లి మండలం బోడు గ్రామంలో చోటుచేసుకుంది. బోడు ఎస్ఐ రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం టేకులపల్లి మండలం బోడు గ్రామానికి చెందిన మిట్టపల్లి బలరాం (46) అనే పూజారి టేకులపల్లి మండల ప్రజలకు సుపరిచితుడు. గురు స్వామి అయిన బలరాం ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకు మాలలు వేస్తుంటారు. ఈయన గురువారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో తన స్వగృహంలో వాడుతున్న కరెంటు మోటార్ రిపేర్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు షాకు తగిలి పడిపోయాడు.
ఆ సమయంలో తన భార్య కవిత స్నానం చేస్తుంది. తాను బయటికి వచ్చి చూసేసరికి కింద పడిపోయి అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే స్థానికుల సహాయంతో హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ తెలిపారు. మృతుడికి భార్య కవిత, కుమార్తె హరివందన, కుమారుడు హరిప్రసాద్ ఉన్నారు. గురు స్వామి హఠాత్ మరణంతో మండలంలో అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు నివాళులర్పించారు.