- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
లే-అవుట్ల అనుమతులను మంజూరు చేయండి : కలెక్టర్ వీపీ గౌతమ్

దిశ, ఖమ్మం సిటీ : లే-అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. శనివారం ఖమ్మం, నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి లే అవుట్ అప్రూవల్ కమిటీ సమావేశంలో ఖమ్మం నగరపాలక సంస్థ సుడా పరిధిలో లే-అవుట్ ఆమోదం కొరకై అందిన 22 దరఖాస్తులను కమిటీ సమావేశంలో పరిశీలించారు. నిబంధనల మేరకు సమర్పించిన దరఖాస్తులను కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో లే-అవుట్ల ఆమోదం కొరకు రెవెన్యూ, విద్యుత్, నీటి పారుదల, రోడ్లు భవనాల, టౌన్ ప్లానింగ్ తదితర అనుబంధ శాఖల నుండి అనుమతులకై సమర్పించిన దరఖాస్తులను 21 రోజుల లోపు అనుమతులను జారీచేయాలని, తదనుగుణంగా జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమోదించడం జరుగుతుందని అన్నారు. గ్రీనరీ కొరకు కేటాయించిన స్థలాన్ని వెంటనే స్వాధీనపర్చుకొని మొక్కలు నాటాలన్నారు. అనుమతులు జారీకి సంబంధిత శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన పిదపనే అనుమతులు జారీచేయాలని కలెక్టర్ సూచించారు. లేఅవుట్ డెవలపర్స్ కూడా నిబంధనల మేరకు చట్టబద్దంగా సమగ్ర ప్రణాళిక ల్యాండ్ డెవలప్మెంట్ పనులు చేపట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, ఇరిగేషన్ సీఈ శంకర్ నాయక్, జెడ్పీ సీఈఓ అప్పారావు, రెవిన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాధ్, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్, మధిర మునిసిపల్ కమిషనర్ రమాదేవి, డీసీటీఓ వికాస్, ఖమ్మం అర్బన్ రూరల్, తహసీల్దార్లు శైలజ, సుమ పాల్గొన్నారు.