తాతా నిఖిల్ కుటుంబాన్ని పరామర్శించిన కలెక్టర్

by Kalyani |
తాతా నిఖిల్ కుటుంబాన్ని పరామర్శించిన కలెక్టర్
X

దిశ, తిరుమలాయపాలెం: ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కుటుంబ సభ్యుడైన తాతా నిఖిల్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి విధితమే. శనివారం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ పిండిప్రోలు గ్రామంలోని వారి గృహంలో ఏర్పాటు చేసిన నిఖిల్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. నిఖిల్ తల్లిదండ్రులు విశ్వేశ్వరరావు, నాగమణి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సానుభూతి తెలిపిన వారిలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, విత్తన అభివృద్ధి రాష్ట్ర చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జేఏసీ మధుసూదన్ రావు, మండల అధికారులు ఎంఆర్ఓ డి.పుల్లయ్య, ఎంపీడీఓ జయరాం తదితరులు పాల్గొన్నారు.



Next Story