ఘనంగా తాత మధు జన్మదినం

by Disha Web Desk 15 |
ఘనంగా తాత మధు జన్మదినం
X

దిశ బ్యూరో, ఖమ్మం : ఖమ్మం జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పుట్టినరోజు వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలోని మాతా శిశు కేంద్రం వద్ద 300 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానానికి ఎదిగి ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు చేయూతనిస్తూ అనతి కాలంలోనే ఎమ్మెల్సీగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రజలకు ఆత్మీయుడిగా చేరువయ్యారని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాతా మధుసూదన్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు ఘనవిజయం సాధించే విధంగా వారికి భగవంతుడు శక్తి ప్రసాదించాలని ప్రార్థించినట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు బొమ్మెర రామ్మూర్తి, ముత్యాల వెంకట అప్పారావు, అశ్విని, లింగాల రవికుమార్, పీఏ సుమంత్, సద్ధాం షేక్ పాల్గొన్నారు.


Next Story