- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
వాటి ఆధారంగా అర్హులను గుర్తించి పథకాలు ఇస్తాం.. మంత్రి పొంగులేటి

దిశ, నేలకొండపల్లి : నిజమైన అర్హులను ఎంపిక చేసేందుకే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం నేలకొండపల్లి మండలం మోటపురం, కోరట్లగూడెం, కోనాయిగూడెం, పైనంపల్లి, అప్పలనర్సింహాపురం, కట్టుకాచారం, కొంగర, బుద్దరాం గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పంచాయతీ భవనాల ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గతంలో జరిగిన గ్రామసభల్లో దరఖాస్తు ఇచ్చి ప్రస్తుతం ఈ నెల 26 నుంచి అమలు కాబోతున్న నాలుగు పథకాల జాబితాలో పేర్లు రాకపోతే ఎవరూ కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. వారి కోసమే మళ్లీ ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
నాలుగు రోజులు పాటు విడతల వారీగా ఆయా గ్రామాల్లో జరిగే గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకునే వారిలో నిజమైన అర్హులు ఉంటే వారికి వెంటనే పథకాలను అందిస్తామన్నారు. రెచ్చగొట్టే మాటలను ఈ ప్రభుత్వం పట్టించుకోదని చిత్తశుద్ధితో పని చేయడమే ఈ ప్రభుత్వానికి తెలుసన్నారు. అర్హులైన ప్రతి పేదవానికి ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండల గ్రామాల్లో ఇప్పటికే దాదాపుగా అన్ని రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, మద్దినేని బేబి స్వర్ణ కుమారి, ఆర్డీవో నర్సింహారావు, స్పెషల్ ఆఫీసర్ రమేష్, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, శాఖమూరి రమేష్, నెల్లూరి భద్రయ్య, కొడాలి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.