- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గ్రామపంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

దిశ, వైరా : గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జేఏసీ నాయకులు ఆవుల అశోక్ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో తమ సమస్యలు పరిష్కరించాలని, మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని వైరా నియోజకవర్గంలోని ఐదు మండలాల పంచాయతీ కార్మికులు పట్టణంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు జేఏసీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ కు వినతి పత్రం అందజేశారు.
అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత 13 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టినా ప్రభుత్వం నేటికీ స్పందించలేదని విమర్శించారు. గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే వేతనం కుటుంబ ఖర్చులకే సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులతో వెట్టి చాకిరీ చేస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. కార్మికులకు నెలకు 19 వేల రూపాయలు వేతనం అందజేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోతే ఈనెల 21వ తేదీన జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, సీపీఐ ఎంఎల్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.