- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అమ్మవారికి బోనం సమర్పించిన జీపీ కార్మికులు..

దిశ, ఖమ్మం రూరల్ : తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని పంచాయతీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె 11వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా కార్మికులు అమ్మవారికి బోనమెత్తారు. తొలుత మండల పరిషత్ కార్యాలయం ఎదుట వారికి ఏఐటీయూసీ, సీఐటీయూసీ, ప్రజాపందా ఆధ్వర్యంలో సంఘీభావం తెలియజేశారు. అనంతరం అక్కడి నుంచి ప్రదర్శనగా స్థానిక ముత్యాలమ్మ గుడి వద్దకు చేరుకొని బోనాలను సమర్పించుకున్నారు. నాయుడుపేటలోని ఖమ్మం -సూర్యాపేట జాతీయ రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రెక్కాడితే గాని డొక్కాడని కార్మికుల పై ప్రభుత్వం కక్షగట్టి వారి న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేయకపోవడం బాధాకరమన్నారు.
కోడి కూయకముందే లేచి పల్లెలను అద్దంలా మెరిపించే కార్మికులపై ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. తక్షణమే ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రాస్తారోకోను విరమించాల్సిందిగా కార్మికులు, సంఘాలకు విజ్ఞప్తి చేశారు. పోలీసుల విజ్ఞప్తి మేరకు ఎట్టకేలకు రాస్తారోకోను విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గాదె లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, ఏఐటీయూసీ నాయకులు చెరుకుపల్లి భాస్కర్, దండి రంగారావు, సీఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి పెరుమల్లపల్లి మోహన్ రావు, ప్రజాపంద నాయకులు బందెల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.