- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
తరుగు లేకుండా తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి

దిశ, కూసుమంచి : అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు బుధవారం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని హైదరాబాద్ లో కలిశారు. దాంతో వెంటనే సివిల్ సప్లయ్ శాఖ మంత్రి గంగుల కమలాకర్, కమిషనర్ అనిల్ తో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు. వెంటనే స్పందించిన మంత్రి, కమిషనర్ మిల్లర్లు తడిసిన ధాన్యంను కటింగ్ లేకుండా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మిల్లర్లు కొనుగోలు చేయని పక్షంలో సివిల్ సప్లయ్ అధికారులే కొనుగోలు చేసి నిల్వ చేయాలని జిల్లా సివిల్ సప్లయ్ అధికారులను ఆదేశించారు. తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు.
పాలేరు నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీచుకుంటుందని వారు హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ని కలిసిన వారిలో డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, డీపీఎంస్ డైరెక్టర్లు నాగుబండి శ్రీనివాసరావు, చావావేణు బీఆర్ఎస్, ఖమ్మం రూరల్ జెడ్పీటీసీ వరప్రసాద్, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల అధ్యక్షులు వున్నం బ్రహ్మయ్య, బెల్లం వేణు, వేముల వీరన్న, కూసుమంచి, తిరుమలాయపాలెం ఎంపీపీపిలు బానోత్ శ్రీనివాస్, మంగీలాల్, ఆత్మా చైర్మన్ బాలకృష్ణా రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు శాఖమూరి సతీష్, నేలకొండపల్లి సొసైటీ చైర్మన్ కోటి సైదారెడ్డి, నాయకులు మరికంటి రేణు బాబు, అనగాని నర్సింహారావు, వజ్జా శ్రీనివాసరావు, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.