- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రజలకు రేగా గుడ్న్యూస్.. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు

దిశ, గుండాల: పినపాక నియోజకవర్గ అభివృద్ధికి వామపక్ష ప్రాంతాల అభివృద్ధి నిధుల కింద కోట్లాది రూపాయల నిధులు మంజూరైనట్లు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు దిశకు తెలిపారు. పినపాక నియోజకవర్గంలో LWE 3వ విడతలో నిధులు మంజూరయ్యాయని ఆయన చెప్పారు.
1) ముత్తాపురం నుండి దొంగతోగు వరకు గుండాల మండలం రోడ్కు రూ.1438.71 లక్షలు
2) దామరథోగు నుండి SC కాలనీ వరకు గుండాల మండలం రోడ్కు రూ.80.96 లక్షలు
3) అడవిరామవరం నుండి దొంగతోగు వరకు గుండాలమండలం రోడ్కు రూ.743.20 లక్షలు
4) సాయనపల్లి నుండి అడవిరామవరం గుండాలమండలం వరకు రోడ్కు రూ.723.50 లక్షలు
5) ఆళ్లపల్లి మెయిన్ రోడ్ రాఘవపురం వద్ద పనులకు ఆళ్లపల్లిమండలం రూ.632.42 లక్షలు
6) ఆళ్లపల్లి నుండి వెంకటాపురం వరకు ఆళ్లపల్లి మండలం రోడ్ రూ.1131.84 లక్షలు
7) మార్కోడు నుండి అడవిరామవరం వరకు ఆళ్లపల్లి మండలం రోడ్ కు రూ.2024.75 లక్షలు
8) కిస్టాపురం నుండి పిట్టతోగూ వరకు పినపాక మండలం రోడ్ కు రూ.296.00 లక్షలు
9) భూపతిరావుపేట నుండి సుందరయ్య నగర్ వరకు పినపాక మండలం రోడ్ కు రూ.156.00 లక్షలు
10) గ్రంధాలయం నిర్మాణం కొరకు రూ 100.00 లక్షలు
అయితే రహదారులు, బ్రిడ్జిల నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.7327.38 లక్షలు (73.27 కోట్లు) పాలనాపరమైన అనుమతులు (అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్) మంజూరు చేసిందని తెలియజేయుటకు సంతోసిస్తున్నాను అని రేగా అన్నారు. ఈ పనులను త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని మొదలు పెడతామని నియోజకవర్గ ప్రజలకు సంబంధిత మండల ప్రజలకు తెలియజేయుచున్నాను అని రేగా సంతోషం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద మొత్తంలో రహదారులకు నిధులు మంజూరు చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్కు రోడ్లు భవనాలశాఖ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఎంపీ మాలోత్ కవిత, స్థానిక మంత్రి పువ్వాడ, అజయ్ కుమార్, సహకరించిన జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా ఎస్పి సునీల్ దత్లకు నియోజకవర్గ ప్రజల తరపున శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు.