- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
క్రీడా పోటీలు ప్రారంభించిన ప్రభుత్వ విప్ రేగా..

దిశ , మణుగూరు: పినపాక నియోజకవర్గ స్థాయి కేసీఆర్ కప్ క్రీడా పోటీలను ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభమైన క్రీడా పోటీలకు నియోజకవర్గ స్థాయిలోను అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాలీబాల్, షటిల్, క్యారమ్, చెస్ పోటీలను నిర్వహిస్తున్నట్లు రేగా కాంతారావు తెలిపారు. ఈ నెల 7 వ తేదీ నుంచి 13 వతేదీ వరకు ఎమ్మెల్యే కార్యాలయం, జడ్పీ హైస్కూల్ ఆవరణలో జరిగే పోటీల్లో పాల్గొనే దూరప్రాంత క్రీడాకారులకు, బస, భోజన వసతిని కూడా ఏర్పాటు చేసినట్లు రేగా కాంతారావు తెలిపారు. మొదటి రోజు వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.౩౦ వేలు, తృతీయ బహుమతిగా రూ,20 వేలు, చతుర్థ బహుమతిగా రూ. 5 వేలు అందించనున్నట్లు రేగా తెలిపారు.